తెలంగాణ ధ్వని న్యూస్ : అమీర్పేట్లో జరిగిన విషాదకరమైన మర్డర్ కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. ఈ ఆధారాలు డీఎన్ఏ టెస్టుకు పంపబడ్డాయి. మాధవి పిల్లల డీఎన్ఏతో సరిపోలితే, మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.
గురుమూర్తి, తన భార్య మాధవి (35) ను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. మాధవి తన భర్త గురుమూర్తి బంధువుల్లోని వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలుసుకున్నప్పుడు, వారు మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవలో గురుమూర్తి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
గురుమూర్తి మాధవిని గోడకేసి కొట్టి చంపి, ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి, బాత్రూంలో హీటర్లో వేసి కాల్చాడు. అనంతరం, మిగిలిన ముక్కలను ముక్కలుగా చేసి, రోకలితో దంచి ముద్దగా చేసుకుని, సంచిలో వేసి చెరువులో పారేశాడు.
పోలీసులు గాలించినా, ప్రారంభంలో మాధవికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ, ఇంట్లో రక్తపు మరకలు, స్టవ్ వద్ద కాలిన మాధవికి చెందిన వెంట్రుకలు గుర్తించబడ్డాయి. వీటిని డీఎన్ఏ టెస్టుకు పంపించిన తరువాత, మాధవికి చెందినవి అనేది తేలితే, మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చే అవకాశాలు ఉన్నాయి.
ఈ హత్య సంబంధిత సమాచారం ప్రస్తావించిన తర్వాత, మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేయడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వారు గురుమూర్తిని కచ్చితంగా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక