తెలంగాణ ధ్వని : హన్మకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం వెరిఫికేషన్ ప్రక్రియ ఈనెల 22 నుండి 30వ తేదీ వరకు జరుగుతుంది. ఈ ప్రక్రియను పూర్తిచేసి, మే 2న అర్హుల జాబితాను ప్రదర్శించాలనేది జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక కోసం మండల స్థాయిలో ప్రత్యేకంగా వెరిఫికేషన్ ఆఫీసర్లు నియమించబడ్డారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో పరిశీలనలు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఇంతవరకూ ఈ కమిటీ సభ్యులతో జరిపినట్లు చెప్పారు. ఇప్పుడు మండల స్థాయిలో అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. దరఖాస్తులను పరిశీలించేందుకు మూడువిధాలుగా జాబితాలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. మహిళలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే, ఈ పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కాదని చెప్పారు. బీపీఎల్ (Below Poverty Line) వర్గానికి చెందినవారే ఈ పథకంలో లబ్ధిదారులు కావాలని క్లారిఫికేషన్ ఇచ్చారు. వెరిఫికేషన్ ప్రక్రియను సమయానికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఏవైనా సందేహాలు ఉంటే, ఎంపీడీఓలు, హౌసింగ్ పీడీల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు సహకరించాలని కలెక్టర్ సూచించారు. తదుపరి, అర్హుల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక