- కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి సురేష్ లాల్.
తెలంగాణ ధ్వని : కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సంచాలకులు ప్రొఫెసర్ బి. సురేష్ లాల్ జర్నలిజం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో సమాజంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సంఘటనలను ప్రతిబింబించే విధానం గురించి చర్చించారు.
ఆయన మీడియా యొక్క బాధ్యతను ఉద్ఘాటిస్తూ, సమాజంలో జరిగే సంఘటనలను సమర్థవంతంగా ప్రజల మనోగతాన్ని ప్రతిబింబించాలనీ, జర్నలిస్టులకు సమాజం కోసం శ్రద్ధ, నిజాయితీతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం సమావేశం మందిరంలో నిర్వహించబడింది. ఇది డాక్టర్ సంగని మల్లేశ్వర్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా, పహల్గములో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి నివాళి అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ప్రొఫెసర్ బి. సురేష్ లాల్ తెలిపారు, “పేదరికం, నిరక్షరాస్యత, ఆకలి వంటి సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించి, ఒక మంచి సమాజాన్ని నిర్మించేందుకు జర్నలిస్టులు నిరంతరం కృషి చేయాలి.
ఆధునిక సమాజంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు, సామాజిక మీడియా కూడా ప్రపంచవ్యాప్తంగా సంఘటనలను శరవేగంగా ప్రదర్శిస్తోంది. ఈ మార్పులను గుర్తించి, జర్నలిస్టులు సృజనాత్మకతతో పని చేయాలి.”
డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, మరియు డాక్టర్ సంగని మల్లేశ్వర్ వంటి గౌరవ అతిథులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని.
జర్నలిజం రంగంలోని అవకాశాలు, పర్యావరణ మార్పులు, మరియు ఏ ఐ, మిషన్ లర్నింగ్ వంటి శాస్త్ర సాంకేతిక మార్పుల ప్రభావం గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం ప్రొఫెసర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్.ప్రతీప్ రడపాక