డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.
తెలంగాణ ధ్వని : నర్సంపేట నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ నాయకులు.నల్లబెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు పెరుగుతోంది. మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో, దస్తగిరిపల్లె గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ తాజా మాజీ వార్డు మెంబర్ గుంపుల రాజు గారు, బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు గంగారాబోయిన సాగర్ గారు, ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు జక్కుల నర్సింహారములు గారు, నల్లబెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎద్దు నరేష్ గారు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ, “నర్సంపేట నియోజకవర్గంలో సమర్థమైన నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. గతంలో ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ మరియు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, బీజేపీ మండల నాయకులు ఊటుకూరి చిరంజీవి గారు, బత్తిని కుమారస్వామి గారు, కక్కెర్ల సమ్మయ్య గారు, మురికి మనోహర్ గారు, దొమ్మటి శ్రీను గారు పాల్గొన్నారు. బీజేపీలోకి కొత్తగా చేరిన నేతలు, పార్టీ నిబంధనలను అనుసరించి ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
ప్రజాదరణ పెరుగుతున్న బీజేపీ:
బీజేపీ పట్ల ప్రజలు చూపుతున్న ఆసక్తి ఈ మార్పుకు నిదర్శనం. నల్లబెల్లి మండలంలో క్రమంగా బీజేపీకి మద్దతు పెరుగుతుండటంతో, రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, బీజేపీ ప్రభుత్వం తీసుకురానున్న విధానాలను ప్రజలకు వివరిస్తామని నాయకులు తెలిపారు.
ఇటువంటి నాయకుల చేరికలతో బీజేపీ మరింత బలపడుతుందని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.
రిపోర్టర్. దీప్తి