telanganadwani.com

కోర్టు తీర్పుతో 44 ఏళ్ల తర్వాత న్యాయం..

తెలంగాణ ధ్వని: కోర్టు తీర్పుతో 44 ఏళ్ల తర్వాత న్యాయం.. దిహులీ నరమేధానికి తీర్పు

1981 నవంబర్ 18న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్పురి జిల్లాలోని దిహులీ గ్రామంలో జరిగిన దారుణ హత్యాకాండ భారత దేశ చరిత్రలో శోచనీయ ఘట్టంగా నిలిచింది. సాయుధ దుండగులు దళితులు నివసించే కాలనీలోకి చొరబడి విచక్షణ లేకుండా జరిపిన కాల్పుల్లో 24 మంది నిరాయుధ దళితులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించి న్యాయ పోరాటం దాదాపు నాలుగు దశాబ్దాలు కొనసాగింది. తాజాగా మెయిన్పురి కోర్టు ఐదుగురు నిందితులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇది బాధిత కుటుంబాలకు ఊరటను కలిగించే తీర్పుగా భావించబడుతోంది.

ఈ కేసు న్యాయం ఆలస్యమైనా విజయవంతమైనదిగా అభిప్రాయపడుతున్నారు ప్రజాసంఘాలు.
నిర్దోషుల రక్తపాతం జరిగినప్పటికీ 44 ఏళ్లపాటు న్యాయం కోసం కష్టపడిన కుటుంబాలకు ఇప్పుడు కొంత భరోసా లభించింది.

రిపోర్టర్: కిరణ్ సంగ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top