తెలంగాణ ధ్వని : వేసవి ఉచిత క్రీడా శిబిరాలను చిన్నారులు మరియు క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. జిల్లా యువజన, క్రీడాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలను గురువారం జిల్లా కేంద్రంలోని ఓ సిటీ స్టేడియంలో కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా, చిన్నారులు తమకు నచ్చిన క్రీడా అంశాలను ఎంపిక చేసుకొని వాటిలో ప్రావీణ్యం సాధించాలని, కోచ్ల మరియు సీనియర్ క్రీడాకారుల పర్యవేక్షణలో క్రీడల్లో రాణించాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
ఈ శిబిరాలు మే 1 నుండి జూన్ 6 వరకు నిర్వహించబడతాయి, ఇందులో వివిధ క్రీడా అంశాలలో కోచ్లు శిక్షణ ఇచ్చి, పిల్లలకు ఆటలతో పాటు శారీరక, మానసిక దృఢత్వం ప్రేరేపించాలని కలెక్టర్ తెలిపారు. అంతేకాక, వరంగల్ జిల్లాలో 10 గ్రామీణ ప్రాంతాలలో కూడా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు.
అర్బన్ (పట్టణ) ప్రాంతంలో పిల్లలకు క్రీడారంగంలో ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందని చెప్పారు.కలెక్టర్ తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ, తమ పిల్లలను క్రీడలలో పాల్గొనడానికి ప్రోత్సహించాలని, క్రీడల ద్వారా ఉన్న ఉద్యోగ అవకాశాలను గుర్తుచేశారు. వేసవి సెలవులలో సమయాన్ని సక్రమంగా ఉపయోగించి క్రీడలపై దృష్టి పెట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా యువజన క్రీడల అధికారి సత్య వాణి, తహసీల్దార్ ఇక్బాల్, ఒలంపిక్ అసోసియేషన్ సెక్రటరీ కైలాష్ యాదవ్, ఓయాసిస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పరంజ్యోతి, జెఎన్టియు స్పోర్ట్స్ బోర్డ్ కన్వీనర్ దిలీప్, జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ సంజీవ్ మరియు క్రీడాకారులు, తల్లిదండ్రులు, వాకర్స్ పాల్గొన్నారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక