telanganadwani.com

GanjaChocolates

గుర్రాలపాడులో ఎక్సైజ్ దాడి: 5.880 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టివేత…

తెలంగాణ ధ్వని : ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామంలో గంజాయి చాక్లెట్లు అమ్మకం కలకలం రేపింది. శ్రీవినాయక గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద కూలీలు నివసిస్తున్న షెడ్‌లలో మాదకద్రవ్యాల విక్రయంపై సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు దాడికి దిగారు. దాడిలో 5.880 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన బానోతు హారియాను అరెస్ట్ చేశారు. అతడు గంజాయి చాక్లెట్లు ఒడిశా నుంచి రైలు ద్వారా ఖమ్మం తరలించి విక్రయిస్తున్నట్టు వెల్లడైంది. ఈ దాడిలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్, సురేందర్, మౌలాంకర్, గురుప్రసాద్, నరసింహ, భద్రమ్మ పాల్గొన్నారు. చాక్లెట్‌ల రూపంలో మత్తు పదార్థాలు అమ్ముతున్న ఈ కొత్త మాయాజాలం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా పిల్లలు, యువత వినియోగించే చాక్లెట్లు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం మరింత కట్టుదిట్టమైన చర్యలు అవసరమవుతున్నాయి..

రిపోర్టర్.ప్రతీప్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top