telanganadwani.com

JammuKashmir

జమ్ముకశ్మీర్‌లో పహల్‌గామ్‌లో ఉగ్రవాద దాడి: 27 మృతి, 20 మందికి పైగా గాయాలు

తెలంగాణ ధ్వని : జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎఫ్‌ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యమని ప్రకటించింది.

పహల్‌గామ్‌లో టూరిస్టులు ట్రెక్కింగ్‌ కోసం వెళ్ళిన సమయంలో ఈ దాడి జరిగింది. కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడిన పర్యాటకులు గుజరాత్, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందినవారుగా ఉన్నాయి. మరణించిన వారిలో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు, వారిలో ఇజ్రాయెల్, ఇటలీ దేశాలకు చెందినవారిని గుర్తించారు.

ఈ దాడి ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఆయన ఉగ్రవాదాన్ని ఖండించి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే, ఈ దాడిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం సంకల్పంతో ఉందని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ అమానవీయ దాడిని ఖండించి, దాన్ని క్షమించరాని నేరంగా అభివర్ణించారు.

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలు ఘటనా స్థలాన్ని కూర్చి ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. పహల్‌గామ్ ప్రాంతంలో అమర్‌నాథ్‌ యాత్రికుల బేస్‌ క్యాంప్‌ కూడా ఉంది. ఈ ఘటనతో యాత్రికుల భద్రతపై తీవ్ర చర్చలు మొదలయ్యాయి.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top