తెలంగాణ ధ్వని, వరంగల్ : డాక్టర్ గాదె సుమంత్ రెడ్డి హత్యకు ఆయన భార్య, ప్రియుడు మరియు పోలీసు కానిస్టేబుల్ కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఏసీపీ నందిరాం నాయక్ ఈ కేసు వివరాలను గురువారం వెల్లడించారు. భార్య వివాహేతర సంబంధం మరియు డబ్బు ఆశతో ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.
వరంగల్ హంటర్ రోడ్డుకు చెందిన డాక్టర్ గాదె సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో సంగారెడ్డిలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లారు. అక్కడ ఫ్లోరా ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. ఆ సమయంలో జిమ్ కోచ్గా పనిచేసే ఎర్రోళ్ల శామ్యూల్ ఫిన్నీతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. సుమంత్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో భార్యను మందలించాడు.
తరువాత ఫ్లోరాకు వరంగల్లో ఉద్యోగం రావడంతో వారు వరంగల్కు తిరిగి వచ్చారు. అయినప్పటికీ, శామ్యూల్ తరచూ వరంగల్ వచ్చి ఫ్లోరాను కలిసేవాడు. ఇది సుమంత్ రెడ్డికి తెలిసి మరోసారి భార్యను హెచ్చరించాడు. దీంతో శామ్యూల్ తో కలిసి ఉండాలంటే భర్తను చంపాలని ఫ్లోరా నిర్ణయించుకుంది.
సుమంత్ రెడ్డిని చంపితే ఇల్లు కట్టిస్తానని ఫ్లోరా శామ్యూల్కు వాగ్దానం చేసింది. హత్య ఖర్చుల కోసం లక్ష రూపాయలు ఇచ్చింది. శామ్యూల్ తన స్నేహితుడు, సంగారెడ్డికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్కుమార్ను కలుపుకొని హత్యకు ప్లాన్ చేశాడు. రాజ్కుమార్కు 50 వేలు ఇచ్చి ఇనుప సుత్తి, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు.
ప్లాన్ ప్రకారం, శామ్యూల్, రాజ్కుమార్ కాజీపేటకు వచ్చి సుమంత్ రెడ్డి ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్తుండగా ఉర్సు కరీమాబాద్ బైపాస్ రోడ్డులోని భట్టుపల్లి వద్ద కారును సుత్తితో వెనుక భాగంలో కొట్టారు. సుమంత్ రెడ్డి కారు ఆపి పరిశీలిస్తుండగా, సుత్తి, రాడ్లతో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు.
మిల్స్ కాలనీ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీఐ వెంకటరత్నం, టాస్క్ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్, ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు బావ్ సింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జలంధర్, ఎండీ గౌస్, ఏఏవో సల్మాన్, ఐటీ కోర్ టీం పీసీ నగేష్ లను ఉన్నతాధికారులు అభినందించారు.
రిపోర్టర్ : భుజాగుండ్ల కళ్యాణి
- #WarangalCrime
- #MurderPlot
- #DoctorMurder
- #Infidelity
- #PoliceArrest
- #CrimeNews
- #IndiaCrime
- #Conspiracy
- #ExtramaritalAffair
- #PoliceInvestigation