telanganadwani.com

డ్రోన్ల నిఘాలో దండకారుణ్యం మావోయిస్టులకు కష్టకాలం.

ఒకప్పుడు మావోయిస్టులకు దుర్భేద్యమైన కోటగా ఉన్న దండకారుణ్యం ఇప్పుడు డ్రోన్ల నిఘా వలయంలో చిక్కుకుంది.

కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలకు అత్యాధునిక డ్రోన్లను అందించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

డ్రోన్ల రాకతో భద్రతా బలగాల ఆపరేషన్లు మరింత సమర్థవంతంగా జరుగుతున్నాయి.

ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరగడంతో మావోయిస్టులకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా కీలక నాయకులను కోల్పోతున్నారు.

డ్రోన్లు రాత్రింబవళ్ళు, ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేసే సామర్థ్యం కలిగివుండటం వలన నిరంతర నిఘా సాధ్యమవుతోంది.

శబ్దం లేని ప్రయాణం, శక్తివంతమైన కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్లలో ఉండటం వలన మావోయిస్టుల కదలికలను సులువుగా గుర్తించవచ్చు.

15 కిలోమీటర్ల పరిధిలో నిఘా ఉంచగల డ్రోన్లు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందిస్తాయి, దీనితో ఆపరేషన్లను సమన్వయపరచడం సులభమవుతుంది.

మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యులను కూడా డ్రోన్ల ద్వారా గుర్తించి లక్ష్యంగా చేసుకోగలుగుతున్నారు.

చలపతి వంటి ముఖ్య నాయకులను డ్రోన్ల సహాయంతో భద్రతా బలగాలు మట్టుబెట్టడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇదే పరిస్థితి కొనసాగితే మావోయిస్టులు తమ స్థావరాలను వదిలి వెళ్లక తప్పదు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top