telanganadwani.com

Group1Results

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం పూర్తి – ఫలితాలు త్వరలో విడుదల

తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా, మొత్తం 21,093 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థుల్లో కేవలం 67.17 శాతం మాత్రమే మెయిన్స్ పరీక్ష రాశారు.

ఈ గణాంకాల ప్రకారం, ఒక్కో పోస్టుకు సుమారు 38 మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో, టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు మూల్యాంకనం పూర్తి చేసినట్లు ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించేందుకు టీఎస్‌పీఎస్సీ తుది సమీక్ష చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, వారం నుంచి పది రోజుల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశముంది. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. గ్రూప్-1 నియామక ప్రక్రియను పూర్తి చేసిన తరువాతనే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ప్రకటించనున్నట్లు సమాచారం.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top