telanganadwani.com

PonnamPrabhakar

తెలంగాణలో విద్యా వ్యవస్థ పై కీలక నిర్ణయం: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి, ప్రతి ఒక్కరికీ తగిన విద్య అందించేందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆదర్శ ఇందిరమ్మ పాఠశాలలు మరియు నూతన నియామకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, మంత్రి వసంత పంచమి సందర్భంగా శ్రీ విద్య సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ సందర్భంగా మంత్రి విద్యాభ్యాసంపై మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతి బిడ్డ ఉన్నత విద్యావంతుడై, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా దేశంలో అన్ని రంగాల్లో ముందుంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అదేవిధంగా, తల్లిదండ్రులు తమ పిల్లలను చదవించేందుకు శ్రద్ధ వహించాలని, విద్యా వ్యవస్థ మీదే దృష్టి పెట్టాలని సూచించారు.

బాలకార్మికులు పై వ్యాఖ్యలు చేస్తూ, పిల్లలను బాలకార్మికులుగా చేయాలని ప్రయత్నించవద్దని, అందుకు సహకరించకుండా విద్యా పరంగా ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

కులగణన పై స్పందిస్తూ, తెలంగాణలో కులగణన అంశం ఒక ఉద్యమంగా కొనసాగిందని, ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు కులగణన పూర్తి చేయనున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన కార్యకలాపాలు, క్యాబినెట్ సమావేశం లో మరింత వివరించబడతాయని, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకునే సమయంలో మరింత కచ్చితత్వంతో ముందడుగు పడతామని చెప్పారు.

ఆసెంబ్లీ సమావేశంలో రేపు అన్ని రాజకీయ పార్టీలు తమ వాదనను వినిపించాలని, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం మానవహక్కుల పరిరక్షణకు కృషి చేస్తుందని కూడా చెప్పారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top