telanganadwani.com

EAPCET2025

తెలంగాణ ఎప్‌సెట్‌ (EAPCET) – 2025 ఫలితాల విడుదల……

తెలంగాణ ధ్వని : తెంగాణ ఎప్‌సెట్ ఫలితాలు (EAPCET Results) విడుదలయ్యాయి. సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలు విడుదల చేశారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌తోపాటు ఇంజినీరింగ్‌ విద్యార్థుల ర్యాంకులను ప్రకటించారు.

అభ్యర్థులు తమ ఫలితాలను eapcet.tgche.ac.in/వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. కాగా, ఈసారి ఫలితాలు నేరుగా విద్యార్థుల సెల్‌ఫోన్‌కే వచ్చేలా ఏర్పాటు చేశారు.

ఇంజినీరింగ్‌, ఫార్మ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం టీజీఎప్‌సెట్‌ పరీక్షను నిర్వహించారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మాఎంట్రెన్స్‌ పరీక్షలు పూర్తవగా,

మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్‌ విభాగంలో 81,198 మంది, ఇంజినీరింగ్‌ విభాగంలో 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు.

 

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top