తెలంగాణ ధ్వని : హన్మకొండ మూడవ అదనపు కోర్టు ఫైనాన్స్ కంపెనీల వేధింపులకు గట్టి బ్రేక్ వేసింది.రుణగ్రహీతలపై రికవరీ ఏజెంట్ల బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన కోర్టు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలు, మహిళల ఎదుట దుర్భాషలాడటం, శారీరక, మానసికంగా వేధించడం ఇకపై సహించదగినది కాదని కోర్టు స్పష్టం చేసింది.ఈ ఉత్తర్వులు బచ్చలకూరి సురేష్ అనే బాధితుడి పిటిషన్కు స్పందనగా వెలువడ్డాయి.
సురేష్ జెఎం హోం లోన్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు.బకాయిల వసూలు పేరుతో రికవరీ ఏజెంట్లు ఇంటికి వచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్టు పిటిషన్ పేర్కొంది.
ఇంట్లోని చిన్న పిల్లలు, మహిళల ముందు దుర్భాషలాడటం తట్టుకోలేక కోర్టును ఆశ్రయించారు.న్యాయవాది ఉప్పరి శంకర్, ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ వేధింపులు జరుగుతున్నాయని వాదించారు.
బాధితుని కుటుంబానికి మానసిక హింసను మిగిల్చే ఈ చర్యలు వెంటనే ఆపాలని కోర్టు ఆదేశించింది.రుణగ్రహీతల వ్యక్తిగత జీవితంలో నిషేధించబడినట్లు తీర్పులో పేర్కొంది.
ఫైనాన్స్ కంపెనీలు, రికవరీ ఏజెంట్లు ఇకపై వేధింపులకు పాల్పడితే నేరుగా చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.
ఈ ఉత్తర్వులు యాప్ లోన్లు, ప్రైవేట్ రుణ సంస్థలకు గట్టి గుణపాఠంగా మారనున్నాయి.చిన్న మొత్తాల అప్పుల పేరుతో పెరుగుతున్న వేధింపులపై కోర్టు జోక్యం ఆశాజనకంగా ఉంది.
రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి తమ హక్కులు ఉన్నాయని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.కోర్టు తీర్పు రుణగ్రహీతలకు భరోసాను కలిగించడమే కాక, రుణదాత సంస్థలకు నియంత్రణ విధిస్తోంది.
ఇకపై రికవరీ పేరుతో బెదిరింపులు జరగకూడదని కోర్టు తేల్చిచెప్పింది.ఇది ఫైనాన్స్ రంగంలో బాధితులకు తాత్కాలిక గానైనా న్యాయం అందించిన తీర్పు.కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయకపోతే సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది
రిపోర్టర్. ప్రతీప్ రడపాక