తెలంగాణ ధ్వని : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ (North Western University), వచ్చే ఏప్రిల్ 19, 2025 న జరిగే “IBC 2025” సదస్సుకు కేటీఆర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన పనిచేసిన సమయంలో దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షించి, పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడంలో చేసిన కృషి గణనీయమని యూనివర్సిటీ పేర్కొంది.
హైదరాబాద్ను యువతకు ఉపాధి అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పాత్ర కీలకమని, తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతిని స్ఫూర్తిదాయకంగా అభివర్ణించింది. కేటీఆర్ ఈ సదస్సులో భారత పారిశ్రామిక వృద్ధి, టెక్నాలజీ అభివృద్ధి, పెట్టుబడుల ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రసంగించనున్నారు. ఈ ప్రత్యేక గౌరవం కేటీఆర్కు ఆర్థిక, పరిశ్రమల రంగాల్లో ఆయన చూపిన దారిదీపికకు ప్రతీకగా నిలుస్తోంది.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక