- డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి
తెలంగాణ ధ్వని : ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదని ఓ సినీ పాట మనకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది.ఆ ఆటకు పాటకు సంగీతం తోడైతే ఆ అనుభూతే వేరు కదా!
పురావస్తు చరిత్ర పరిశోధకుడు, డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి తన పరిశోధన యాత్రలో భాగంగా నవీన శిలా యుగం నాటి సంగీతం వినిపించే అరుదైన రాతి కళాఖండాన్ని గుర్తించారు.
జనగామ జిల్లా నర్మెట్ట మండలం పరిధిలోని బొమ్మకూరు గ్రామం చారిత్రికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది . జనగామ జిల్లలోనే అతి పెద్ద ఇనుము లోహ పరిశ్రమ గతంలో ఇక్కడ విలసిల్లింది.15 కిలోల బరువున్న చిట్టెపు రాళ్ళు యిక్కడ ఉన్నాయి.
ఈ ప్రాంతంలోనే అరుదైన రాతి పనిముట్లను లేదా ధాన్యాన్ని నూరుకునే శిల ఉంది. సంగీతం పలికే శిల ఇది.
రెండు వైపులా శిలకు మద్యలో ఒక వెడల్పాటి పుటాకార నూరుడు గుంటలో తిరిగి పక్క పక్కన మరో రెండు నూరుడు గుంటలు ఉన్నాయి.ఈ నూరుడు గుంటలు శిలను ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చి దిద్దాయి. అనంతర కాలంలో ఈ గుంటల వెలుపల తిరిగి రాతి పనిముట్లను లేదా ఇనుప పనిముట్లను పదును పెట్టుకోవడానికి ఉపయోగించారు.

ఈ శిలను చిన్న రాయితో కొట్టి సంగీతము వినిపిస్తూ ఆడుతూ పాడుతూ ఆహార పదార్థాలను నూరుకోవడమో , పనిముట్లను పదును తేవడమో చేసేవారు.జనగామ జిల్ల చారిత్రక సంపదను వివిధ రాష్ట్రాల పరిశోధకులే కాకుండ ఇంగ్లండ్, ఇటలీకి చెందిన పరిశోధకులు దర్శించారు. ఇటీవల జర్మనీ నుంచి వచ్చిన పరిశోధకులు బొమ్మకూరు , ఇతర గ్రామాలను సందర్శించారు.
ప్రతీ ఏటా జిల్లా అంతటా అనేక పురావస్తు చరిత్ర ఆధారాలు, శిల్పాలు కనుమరుగవుతున్నాయి. జిల్ల కలెక్టరు గారు చొరవ తీసుకుని జనగామ జిల్లాలో మ్యూజియం ఏర్పాటుకు కృషి చేయాలని పరిశోధకుడు కోరారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక