telanganadwani.com

U19WomensT20WorldCup

భారత యువత మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ కైవసం – దక్షిణాఫ్రికాను 9 వికెట్లతో ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది

తెలంగాణ ధ్వని : భారత యువత మహిళల క్రికెట్ జట్టు అండర్-19 మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికాను 9 వికెట్లతో ఓడించి భారత యువ జట్టు ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయం భారత్ కోసం గొప్ప ఘనతగా నిలిచింది.

ఈ మ్యాచ్ కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ వేదికగా జరిగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోవడం, కానీ మైదానంలో తీవ్ర ఒత్తిడికి గురవడంతో జట్టు 82 పరుగులకే ఆలౌట్ అయింది. మైకే వాన్ వూర్స్ట్ 23 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచారు.

భారత జట్టులో, జి త్రిష ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 15 పరుగులలో 3 వికెట్లు తీశారు. వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణికా సిసోడియా చెరో రెండు వికెట్లు తీసి, షబ్నమ్ షకీల్ ఒక వికెట్ తీసారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విఫలమవడంతో, భారత్ 83 పరుగుల లక్ష్యాన్ని 11.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.

జి త్రిష 33 బంతుల్లో 44 పరుగులతో అద్భుత ఆటతీరు కనబరిచారు, సానికా చాల్కే 22 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఈ విజయంతో, భారత్ గత సంవత్సరం ఇంగ్లండ్‌ను ఓడించి తన తొలి ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్నట్లు, ఈసారి కూడా భారత్‌కు ఘనవిజయం సాధించినది.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top