telanganadwani.com

ManjuWarrier

మంజూ వారియర్ కొత్త థ్రిల్లర్ ‘ఫుటేజ్’ – ఓటీటీలో ట్రెండింగ్ మూవీ!

తెలంగాణ ధ్వని : కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ మంజూ వారియర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 40వ పడిలో పడినా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం ఆమెది. గతేడాది రజనీకాంత్ తో కలిసి వేట్టయాన్ లో సందడి చేసిందీ అందాల తార.

తాజాగా మంజూ వారియర్ నటించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదే మలయాళ ఫుటేజ్. మంజు వారియర్‌తో పాటు విశాఖ్ నాయర్‌, గాయత్రి అశోక్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి పాత్రతోనే ఈ కథ మొత్తం సాగుతుంది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, అదే నండి మహారాజా విలన్ ఈ కు ప్రజెంటర్ గా వ్యవహరించడం విశేషం.
ఇక అన్వేషిప్పిన్ కండేతుమ్‌, అంజమ్ పాథిరా, అండ్రాయిడ్ కుంజప్పన్‌ తదితర మలయాళ సూపర్ హిట్ లకు ఎడిటర్ గా పనిచేసిన సైజు శ్రీధరన్ ఈ మూవీని తెరకెక్కించాడు. డైరెక్టర్ గా ఇదే అతనికి మొదట . గత ఏడాది అగస్టు 23న థియేటర్లలో రిలీజైన ఈ కు మంచి స్పందన వచ్చింది. కథా, కథనాలు ఆసక్తికరంగా ఉండడం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండడంతో ఫుటేజ్ మూవీ మాలీవుడ్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అదే సమయంలో విశాఖ్‌, గాయత్రి ల మధ్య బోల్డ్, లిప్‌లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటంపై విమర్శలు వచ్చాయి. థియేటర్లలో బాగా ఆడిన ఈ అక్టోబర్ 18న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలివ్ లోకి వచ్చింది. ఇప్పటికీ మూవీ ట్రెండ్ అవుతూనే ఉండడం విశేషం.

ఫుటేజ్ కథేంటంటే..

ఫుటేజ్ కథ విషయానికి వస్తే.. పేరుకు తగ్గట్టుగానే ఈ మొత్తం వీడియో రికార్డింగ్ ఫార్మాట్ లో సాగుతుంది. కథ కూడా కొత్తగా ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉండిపోతారు. అదే క్రమంలో యూట్యూబర్లైన విశాఖ్‌, గాయత్రి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. వీరున్న అపార్ట్ మెంట్లోనే ఒక మహిళ ఒంటరిగా ఉంటుంది. దీంతో ఆ మహిళ గురించి తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేయాలని విశాఖ్‌, గాయత్రి అనుకుంటారు. అదే సమయంలో వారికి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి? మరి ఆ ఫ్లాట్ నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నదే ఫుటేజ్ మూవీ కథ. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కాస్త బోల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లలతో చూడకపోవడమే బెటర్.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top