తెలంగాణ ధ్వని : వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. గవిచర్లకు చెందిన గాలి చందు (17) తన ద్విచక్ర వాహనంపై ఆశాలపెళ్లి గ్రామం వైపు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందు తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందు మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రహదారి ప్రమాదాలను నివారించేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రిపోర్టర్. దీప్తి