తెలంగాణ ధ్వని : వరకట్న వేధింపులు భరించలేక ఒక గృహిణి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. యాదాద్రి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన 25 ఏళ్ల మలిపెద్ది రవళి 2019లో మోత్కూరు మండలానికి చెందిన బోరెడ్డి రాజశేఖర్ రెడ్డితో వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం, బతుకుదెరువు కోసం హైదరాబాద్ పఠాన్ చెరువులో నివసిస్తూ, తరువాత ఉప్పల్ లో చిలుక నగర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు చిన్నపిల్లలు, సాత్విక (5) మరియు పునర్విక (3) ఉన్నారు.
పెళ్లయిన మూడు నెలల నుండి రవళిపై భర్త, అత్త, మామ మరియు ఆడపడచు వరకట్నం కోసం వేధింపులు పెరిగాయి. గతంలో ఈ విషయం గురించి పంచాయతీ కూడా జరిగింది, కానీ వారు మారలేదు. గత సంవత్సరం నుండి భర్త తన భార్యను వదిలి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన రవళి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, “భర్త, అత్త, మామ, ఆడపడచు వేధింపుల కారణంగానే మా కూతురు ఈ నిర్ణయం తీసుకుంది” అని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.
రిపోర్టర్. ప్రతీప్ రడపాక