తెలంగాణ ధ్వని : వేసవి భయంకరంగా మారుతున్న వేళ వరంగల్లో ఓ విచిత్రమైన దొంగతనం చర్చనీయాంశమైంది. నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం నుండి ఓ ఆటో డ్రైవర్ నీటి కుండను దొంగలించాడు. ఈ సంఘటన స్థానికులను షాక్కు గురి చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల్లో, ఆ వ్యక్తి ఆటోలో వచ్చి కాసేపు పరిశీలించి, ఎటువంటి ఆందోళన లేకుండా చకచకా కుండను ఎత్తుకెళ్లాడు. నిర్వాహకులు నీళ్లు నింపేందుకు వచ్చేసరికి కుండ లేకపోవడంతో సీసీ టేపులు పరిశీలించి నిజం తెలుసుకున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు దీనిపై హాస్యంగా స్పందిస్తుండగా, మరికొందరు దొంగ చేసిన పని వెనక అతని పరిస్థితులనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేసవిలో నీళ్లు తాగడమే కష్టం అయిన రోజుల్లో, నీటి కుండ కూడా దొంగలకు ఎర అవుతుండటం విచారకరం. ఇది ఒక చిన్న దొంగతనం అయినప్పటికీ, ఆలోచింపజేసే సంఘటన. మన చుట్టూ ఉన్న పేదరికాన్ని, నీటి అవసరాన్ని స్పష్టంగా చూపిస్తోంది
రిపోర్టర్. ప్రతీప్ రడపాక