telanganadwani.com

StationGhanpur

స్టేషన్ ఘన్‌పూర్ – తెలంగాణ రాజకీయ వేడి కేంద్రంగా!

ఒకే పార్టీలో – కానీ విభేదాలే మిగిలిన జ్ఞాపకాలు.

ఎంపీగా కుమార్తె విజయం – రాజకీయ సమీకరణాల్లో మార్పు

కబ్జా ఆరోపణలు – సవాళ్లపై సవాళ్లు

ఉప ఎన్నికల ఊహాగానాలు – కలకలం

తెలంగాణ ధ్వని : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం మరోసారి హాట్‌స్పాట్‌గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజా పరిణామాలు ఈ ప్రాంత రాజకీయాలను హిలించేలా చేస్తున్నాయి. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య సాగుతున్న రాజకీయ శత్రుత్వం మరో దశకు చేరింది. వీరికి తోడుగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడ చేరడంతో రాష్ట్రంలోని రాజకీయ ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి.

బీఆర్ఎస్ హయాంలో ముగ్గురు నాయకులు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కడియం కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఈ త్రివేణి సాంగత్యం పరస్పర దూషణలతో ముదిరింది. రాజయ్య, పల్లా ద్వయం కలిసి కడియంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నా, కడియం వారిని అదే స్థాయిలో ఢీకొంటున్నారు.

కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరి, తన కుమార్తె కావ్యను వరంగల్ ఎంపీగా నిలబెట్టి గెలిపించడంతో స్థానిక రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. ఇది రాజయ్యకు షాక్ ఇవ్వడమే కాకుండా, బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన కలిగించింది.

పల్లా, రాజయ్యలు కడియంపై చేసిన భూ కబ్జా ఆరోపణలతో స్టేషన్ ఘన్‌పూర్ మరింత రాజకీయ మైనాఫీల్డుగా మారింది. దీనికి కడియం ఘాటుగా స్పందిస్తూ “నిరూపిస్తే గులాంగిరి చేస్తా” అంటూ సవాల్ విసిరారు. అదే సమయంలో తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టుల వ్యాఖ్యలు, కడియం రాజీనామా డిమాండ్లు, కాంగ్రెస్ సభలు, అభివృద్ధి పనుల ప్రారంభం – ఇవన్నీ కలిసొచ్చి స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? అనే ప్రశ్నను ముందుకు తెచ్చాయి.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top