telanganadwani.com

DrugBust

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాదీనం – రూ.1.60 కోట్ల విలువైన 1300 ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం, ముగ్గురు విదేశీయులు అరెస్ట్

తెలంగాణ ధ్వని : హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి, పోలీసులు రూ.1.60 కోట్ల విలువైన 1300 ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దందా ఆరోపణలతో ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేయడంలో పోలీసులు విజయం సాధించారు.

హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్‌తో కలిసి లంగర్ హౌస్ మరియు హుమాయున్ నగర్ ప్రాంతాల్లో బుధవారం జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ ఘనత సాధించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,  డ్రగ్స్ సరఫరా చేసే ముగ్గురు విదేశీయులు నగరంలో ప్రవేశించారని, వారి గురించి సమాచారం అందుకున్నతర్వాత, వారికి చేజిక్కించిన ఈ డ్రగ్స్ సరఫరా వ్యవస్థను అరికట్టేందుకు వీరిపై దర్యాప్తు ప్రారంభించారు.

టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర మాట్లాడుతూ, “మాకు వచ్చిన సమాచారం ప్రకారం, వీరు చాలా కాలంగా ఈ వ్యాపారంలో ఉన్నారు. 2009లో బిజినెస్ వీసా మీద ఇండియాకు వచ్చిన నిందితులు  వీసా 2013లో గడువు ముగిసింది. కానీ ఆ తరువాత వారు ఈ డ్రగ్స్ దందాలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని విభిన్న ప్రాంతాల్లో సరఫరా చేస్తూ, నగరంలో వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు గుర్తించాము” అని తెలిపారు .

ఈ ఆపరేషన్‌లో మొత్తం 1300 ఎండీఎంఏ డ్రగ్స్ ప్యాకేజీలు స్వాధీనం చేయడం జరిగింది మొత్తం ఈ డ్రగ్స్ విలువ రూ.1.60 కోట్ల వరకు ఉంది. ఆపరేషన్‌లో అరెస్ట్ అయిన విదేశీయులు నేరానికి సంబంధించిన  సూత్రధారులుగా గుర్తించబడ్డారు.ఈ డ్రగ్స్ ర్యాండ్ హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అంశంగా మారింది. గత కొంతకాలంగా, నగరంలో డ్రగ్స్ సరఫరా అగ్రగామిగా మారింది. ఈ నేపథ్యంలో, పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు డ్రగ్స్ సరఫరా చేసే మరిన్ని నెట్‌వర్కులను గుర్తించి, అవి అరికట్టే ప్రక్రియలో భాగంగా ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టాలని నిర్ణయించారు. శక్తివంతమైన డ్రగ్స్ దందా వలన యువతపై నెమ్మదిగా దుష్పరిణామాలు కనిపిస్తుండడంతో, పోలీసులు ఈ చర్యలు మరింత వేగంగా తీసుకోవాలని యోచిస్తున్నారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top