telanganadwani.com

MarupalliRavi

40వ డివిజన్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కార్పొరేటర్ మరుపల్ల రవి గారు…

తెలంగాణ ధ్వని : 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి గారు డివిజన్ పరిధిలోని కామినిపెంటలో ఉన్న అంగన్వాడి సెంటర్ -2 ను ఆకస్మికంగా సందర్శించి, అక్కడ లబ్ధిదారులతో మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం మరియు నిత్యావసర వస్తువులను సకాలంలో అందించాలని ఈ సందర్భంగా ఆయన అంగన్వాడి టీచర్ కు సూచించారు.

సందర్శనలో భాగంగా సంక్షేమంపై  దృష్టి సారించిన ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి అందుతున్న సేవలు మరియు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, తమకు అందిస్తున్నటువంటి కోడిగుడ్లు చిన్నగా ఉంటున్నాయని, కొన్నిసార్లు పాడైపోయినవి కూడా ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కార్పొరేటర్ మరుపల్ల రవి గారు ప్రభుత్వం వారికి అందిస్తున్నన్నటువంటి  నిత్యావసర సరుకులను ప్రతినెల లబ్దిదారులకు అందేలా చూడాలని మరియు  బాలామృతం వంటి పౌష్టికాహారాల గురించి వారికి వివరించారు.  ప్రతి నెలా ఆరోగ్య సిబ్బంది ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నందున, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లులను కోరారు.

అంగన్వాడి కేంద్రంలో పరిశుభ్రతకు ప్రశంస.

అంగన్వాడి కేంద్రం పరిశుభ్రంగా ఉండటం పట్ల కార్పొరేటర్ సంతృప్తి వ్యక్తం చేశారు అంగన్వాడి కేంద్రం అంటే పిల్లల మరియు గర్భిణీ స్త్రీల కోసం నిర్వహించే ఒక సంరక్షణ మరియు పోషకాహార కేంద్రం అని తెలిపారు సందర్శనలో అంగన్వాడి టీచర్ గండ్రాతి మణిమాల మరియు ఆయా పిన్న మాధవిలు పాల్గొన్నారు.

రిపోర్టర్. ప్రతీప్ రడపాక 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top